01-11-2025 07:22:07 PM
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 14 మందికి జైలు శిక్షలు జరిమానా, 57 మందికి జరిమానాలు
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదు, తస్మాత్ జాగ్రత్త..
వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ఆదేశాల మేరకు 14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 71 మంది మందుబాబులు పట్టుబడగా వారిని వేములవాడ పోలీసులు శనివారం రోజున కోర్టులో ప్రవేశపెట్టగా 14 మంది మందుబాబులకు జైలు శిక్షలు, జరిమానాలు, 57 మందికి జరిమానాలు విధిస్తు వేములవాడ మేజిస్ట్రేట్ జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ప్రకటనలో తెలిపారు.
జైలు శిక్ష, జారీ పడిన వారి వివరాలు
1.10 మందికి రెండు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు జరిమానా. 2.ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా 3. ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల జరిమానా.. 4.49 మందికి ఒక్కొక్కరికి 1500 రూపాయల జరిమానా. 5.08 మందికి ఒక్కొక్కరికి 2500 రూపాయల జరిమానా. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లోపట్టుబడిన మందు బాబులకు పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేపించారు.
ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.. ప్రతి రోజు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించాడం జరుగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడిన వారికి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశలకు పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతయని, ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.