గ్యాస్ ట్యాంకర్లో మంటలు: ఐదుగురు స్పాట్ డెడ్
రాజస్థాన్: జైపూర్-అజ్మీర్ హైవేపై ఫ్యూయల్ పంప్ సమీపంలో శుక్రవారం ఉదయం ఎల్పిజి తీసుకువెళుతున్న ట్యాంకర్ వాహనాలను ఢీకొట్టిన తర్వాత సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఐదుగురు చనిపోయారు. 41 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. నగరంలోని భంక్రోటా ప్రాంతంలో ఉన్న ఇంధన పంపులో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.
పెట్రోల్ బంక్ సమీపంలో ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇంధన కేంద్రం వద్ద పార్క్ చేసిన పలు వాహనాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. దాదాపు 20 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఘటన తర్వాత, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా ఇంధన కేంద్రం నుంచి పెద్దఎత్తున మంటలు వెలువడుతున్నట్లు ఆ ప్రాంతం నుండి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.






