జాజిరెడ్డిగూడెం సీసీజీ సస్పెండ్
వీఓఏను, కమిటీ సభ్యులను విధుల నుంచి తొలగింపు..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం పరిధిలోని తిమ్మాపురం-1వ గ్రామ సమాఖ్యలోని వీఓఏ బూర్గుల చంద్రకళ, కమిటీ సభ్యులు కర్కాని శైలజ, తోట హైమవతి, పద్మ, లింగమ్మ, తిమ్మాపురం గ్రామంలోని ఐకేపీ వారు ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ సక్రమంగా నిర్వహించకుండా, వీఓఏ చంద్రకళ వ్రాసిన ట్రక్ షీట్ లో కొట్టివేతలు, కొనుగోలు పత్రంలో తప్పులు, ట్యాబ్ ఎంట్రీ కూడా ఇతరులు చేస్తున్నట్లు దృష్టిలోకి రావడంతో పంపించిన ధాన్యంలో తూకంలో తేడాలు ఉండటంతో సంబధిత సీసీజి నగేష్ ను సస్పెండ్ చేస్తూ, వీఓఏను, కమిటీ సభ్యుల మొత్తాన్ని తొలగిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్(District Collector Tejas Nandalal) సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.






