5 May, 2026 | 7:45 PM

పండుగలు వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

05-05-2026 06:20 PM

జవహర్ నగర్ ఎస్హెచ్ఓ సైదులు

జవహర్ నగర్,(విజయక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పండుగలు... వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రజలు శాంతియుతంగా మెలగాలని కోరుతూ జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు ఆధ్వర్యంలో మంగళవారం ముస్లిం హిందూ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ పండుగల మాటున అల్లర్లు సృష్టించాలని చూస్తే సహించేది లేదని ఎంతటి వారినైనా వదిలి పెట్టబోమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఘర్షణలు జరిగే ఆస్కారం ఉంటే ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోదర భావంతో ప్రజలు పండుగలు జరుపుకోవాలని సూచించారు.