calender_icon.png 21 June, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థులకు జేఈఈ కోచింగ్

21-06-2025 12:34:53 AM

ప్రభుత్వ కాలేజీల్లో తెలంగాణ అచీవర్స్-2025 

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో తెలంగాణ అచీవర్స్-2025 అనే ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రారంభించనుంది. విద్యార్థులకు జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిజిక్స్ వాలా భాగస్వామ్యంతో కోచింగ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి జయప్రద బాయి పాల్గొన్నారు.