02-08-2024 01:10:25 AM
హైదరాబాద్, ఆగస్టు1 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ భేటీ అయ్యింది. జాబ్ క్యాలెండర్ ప్రకటన, కొత్త రేషన్కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ కార్డులను వేరుగా ఇవ్వడం, గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీల భర్తీతోపాటు జీహెచ్ఎంసీలో ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న గ్రామాల విలీనం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది.
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రు లు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి , పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరాలువెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెళ్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ. 437 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెంబర్ను ప్రకటిస్తామని, మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటిని నేరవేరుస్తామని చెప్పారు. క్రీడాకారులు, విధి నిర్వ హణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణ యం తీసుకున్నట్టు వివరించారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీకి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లతో ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
నిజాం చక్కర పరిశ్ర మ పునరుద్ధరణ, హైదరాబాద్లో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశ యాలను తరలించి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని, ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాల నోటిఫి కేషన్లపై రీనోటిఫికేషన్ ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయ ని చెప్పారు. వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్రెడ్డి అందరికంటే ముందే స్పందించారని అన్నారు. కుల గణన తర్వాత రిజర్వేషన్ల అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకా శం ఉందని తెలిపారు.
గౌరారం ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది : మంత్రి పొన్నం
గౌరారం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కా ర్ పదేళ్లుగా నిర్ల క్ష్యం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ ప్రా జెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని, అం దుకు రూ.437 కోట్లు కేటాయించాలని క్యాబినెట్లో నిర్ణయించడం అభినందనీయమని అ న్నారు. గౌరారం ప్రాజెక్టు పూర్తయితే హుస్నాబాద్లో 57,852 ఎకరాలు, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్సార్ 2007లో దీనికి శంకుస్థాపన చేశారని, ఇప్పు డు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ధరణి పోర్టల్ పేరు భూమాతగా మార్పు
ధరణి పోర్టల్ను భూమాతగా మార్చాలని క్యాబినెట్లో చర్చించినట్టు మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసినట్టు మంత్రి వివరించారు
క్యాబినెట్ నిర్ణయాలు