16 April, 2026 | 9:45 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

29-11-2025 10:05 PM

రాజాపూర్: మండలంలోని కుచ్చర్ కల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు మనోహర్ రెడ్డి, ఆయన కుమారుడు సుజయ్ చంద్రారెడ్డి శనివారం జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి జనంపల్లి శశికళ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి దుశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుజాయ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కుచ్చర్ కల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సుజయ్ చంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, సత్యం వెంకటయ్య మల్లేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు యువకులు పాల్గొన్నారు.