11-06-2025 12:57:18 AM
అన్నివర్గాలకు సముచిత స్థానం
కరీంనగర్, జూన్ 10 (విజయ క్రాంతి): పీసీసీ కార్యవర్గంలో తొలుత ప్రకటించిన పా ర్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సముచిత చోటు లభించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులకు ఈ పదవులు లభించాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుని గా పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బల్మూ రి వెంకట్ను నియమించారు. బల్మూరి వెం కట్ ఎన్ఎస్ఈయూఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా మాజీ స్పీకర్, దివంగత శ్రీపాద రావు తనయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ శ్రీనుబాబును నియమించారు. శ్రీనుబాబు పార్టీలో అనేక సంవత్సరాలుగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.
పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, ఎన్ఎస్ఈయూఐ మాజీ నాయకుడు ఈర్ల కొముర య్యకు ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. చొప్పదండి నియోజకవర్గం గంగాధరకు చెం దిన రుద్ర ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ సో షల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన రుద్ర శ్రీనివాస్ తోపాటు తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలను ఒక్కతాటిపైకి తె చ్చి ప్రజా సంఘాల జేఏసీగా ఏర్పాటు చేసి పోరాడిన అంబేడ్కర్ యువజన సంఘం నా యకుడు గజ్జెల కాంతం, కరీంనగర్ కు చెం దిన సీనియర్ నాయకుడు రహ్మత్ హుస్సే న్, కరీంనగర్ జిల్లా బొమ్మకల్ కు చెందిన కాశిపాక రాజేశ్ లను పీసీసీ ప్రధాన దర్శులుగా నియమించారు.
సంయుక్త కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మ రికొందరికి చోటు లభించే అవకాశం ఉంది. పీసీసీలో చోటు లభించని సీనియర్లు త్వర లో నియమించనున్న జిల్లా కాంగ్రెస్ అద్యక్ష పదవి రేసులో ఉన్నారు.