20 April, 2026 | 12:50 AM

గుండెపోటుతో జర్నలిస్టు మృతి

26-03-2025 10:13 AM

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిక్కనూరుకి చెందిన జర్నలిస్టు(Journalist) గుండెపోటుతో మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ ఒక దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయనకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన మృతి పట్ల మండల జర్నలిస్టులు తీవ్ర సంతాపం తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్టు సంఘం ప్రతినిధులు కోరారు.