రిపోర్టర్ శ్రీనివాస్ను పరామర్శించిన పాత్రికేయులు
11-04-2026 02:02 PM
కరీంనగర్,(విజయక్రాంతి): హార్ట్ సమస్యతో ఇటీవల స్టంట్ చికిత్స పొందిన రిపోర్టర్ శ్రీనివాస్ను శనివారం పాత్రికేయులు పరామర్శించారు. కొత్తపల్లి ప్రాంతంలోని ఆయన నివాసానికి వెళ్లిన సహచరులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయ క్రాంతి స్టాఫ్ రిపోర్టర్ విజయ సింహా రావు, ఆదాబ్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ చిట్టిమళ్ళ మహేందర్, విజయ క్రాంతి సర్క్యులేషన్ మేనేజర్ రాజు,క్రైమ్ రిపోర్టర్ రామకృష్ణ కలిసి శ్రీనివాస్ను కలుసుకుని ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శ్రీనివాస్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాత్రికేయుల పరామర్శకు వారు కృతజ్ఞతలు తెలిపారు.




