15 June, 2026 | 7:21 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

గుంపెల్ల గూడెంలో ఎక్సైజ్ దాడులు

03-06-2026 08:56 PM

సుమారు రూ 2 లక్షల మద్యం స్వాధీనం

కారేపల్లి,(విజయక్రాంతి): ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు రూ.2 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనపరచుకొని అప్పాయిగూడెంలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎక్సైజ్ సీఐ ప్రశాంతి తెలిపారు.వివరాల్లోకి వెళితే కారేపల్లి మండల పరిధిలోని గుప్పెల్ల గూడెం గ్రామంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడుల్లో ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి వివరాలను వెల్లడిస్తామని అన్నారు. కాగా ఇటీవల యదేచ్చగా బెల్ట్ షాపులకు మద్యం తరలించడం పై పలు కథనాలు ప్రచురితం అవడంతో ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు తనిఖీలు ముమ్మరం చేశారు.