కుటుంబాన్ని పరామర్శించిన జడ్జి దుర్గం గణేష్
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఇటీవల జరిగిన విషాద ఘటనలో ప్రభావితమైన కుటుంబాన్ని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబం పనిచేస్తున్న ఇటుక బట్టీని సందర్శించి, అక్కడి కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్మికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇటుక బట్టీ యజమానికి సూచించారు.
న్యాయ సేవా సంస్థల ద్వారా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను జిల్లా జడ్జికి పంపిస్తామని చెప్పారు.
జడ్జి వెంట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, ఏజీపీ దూడం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






