16-05-2025 03:50:09 PM
నిజాంసాగర్, (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలము లోని మంగుళూర్ గ్రామం లో శుక్రవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంతారావు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి లబ్ధిదారుల కు మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమం లో అయన మాట్లాడుతూ అర్హులయినా ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం లో సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.కార్యక్రమం లో పిట్లం మార్కెట్ కమిటి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీఓ గంగాధర్,నాయకులు చాకలి సాయిలు,తదితరులు పాల్గొన్నారు.