15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రేపు కేసముద్రంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

16-05-2025 03:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం రైతు వేదికలో తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బి.వెంకన్న తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల కు చెందిన శాస్త్రవేత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ కళాశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9:30 గంటలకు రైతులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వానాకాలం పంటల సాగులో చేపట్టవలసిన ముందస్తు పనులు, అదేవిధంగా సాగుకు సమాయత్తం చేయడానికి  రైతులకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారని, రైతు సోదరులు శనివారం ఉదయం 9:30 గంటలకు కేసముద్రం రైతు వేదికకు విచ్చేసి శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి  వచ్చే వానాకాలం సీజన్లో  మంచి పంట దిగుబడులు పొందాలని  కేసముద్రం మండల  వ్యవసాయ అధికారి బి. వెంకన్న తెలిపారు.