28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రేపు కేసముద్రంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

16-05-2025 03:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం రైతు వేదికలో తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బి.వెంకన్న తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల కు చెందిన శాస్త్రవేత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ కళాశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9:30 గంటలకు రైతులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వానాకాలం పంటల సాగులో చేపట్టవలసిన ముందస్తు పనులు, అదేవిధంగా సాగుకు సమాయత్తం చేయడానికి  రైతులకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారని, రైతు సోదరులు శనివారం ఉదయం 9:30 గంటలకు కేసముద్రం రైతు వేదికకు విచ్చేసి శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి  వచ్చే వానాకాలం సీజన్లో  మంచి పంట దిగుబడులు పొందాలని  కేసముద్రం మండల  వ్యవసాయ అధికారి బి. వెంకన్న తెలిపారు.