01-06-2025 12:00:00 AM
హైదరాబాద్, మే31 (విజయక్రాంతి): వేసవి సెలవులు ముగియ డంతో జూన్ 2 నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో నూతన విద్యాసంవత్సరం షురూ కానుంది. విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కాగా మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇచ్చారు. ఇవి ముగియడంతో నూతన విద్యాసంవత్సరం తిరిగి ప్రారంభం కానుంది.