31-05-2025 11:49:43 PM
చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగరీత్యా పదవీ విరమణ అనేది సహజమని చిక్కడపల్లి ఏసీబీ ఎల్. రమేష్ కుమార్(ACP L. Ramesh Kumar) అన్నారు. ఈ మేరకు శనివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించిన బాలకృష్ణన్ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఏసీపీ రమేష్ కుమార్ మాట్లాడుతూ... బాలకృష్ణన్ పోలీసు శాఖలో గత 36 సంవత్సరాలుగా పోలీసు శాఖకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బి. రాజు నాయక్, ఎస్త్స్రలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.