calender_icon.png 6 June, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్జీయూకేటీ అడ్మిషన్లు ప్రారంభం

01-06-2025 12:00:00 AM

ఈనెల 21వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఆర్జీయూకేటీ బాసర, మహ బూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరానికిగానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులకు అడ్మిషన్లు చేపడుతున్నారు.

బాసర క్యాంపస్‌లో 1,500 సీట్లు, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో 180 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నట్లు వర్సిటీ వీసీ ప్రొ.గోవర్ధన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ విధానంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపా రు.

పదోతరగతిలో అత్యధిక మా ర్కులు సాధించిన గ్రామీణ పేద వి ద్యార్థులు ఎవరైనా జూన్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తికలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసు కోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.