30-05-2025 12:35:35 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, మే 29 : కాంగ్రెస్ సర్కా రు తోనే పేదలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అ న్నారు. గురువారం ఆయన శంషాబాద్ పట్టణంలోని మహిళా మండలి భవనంలో శం షాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మంజూరై న 524 ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల కో సం అనేక అనేక పథకాలను ప్రవేశపెట్టి ఎం తో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కష్టసుఖాలు తెలిసినవారన్నారు.ప్రభుత్వ పథకాలను అం దుకున్న వారు వాటిని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. పేద ప్రజల ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షలు ఉచితంగా ఇవ్వడం చరిత్రలోనే మొదటిసారి తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో అధికారు లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, వారికి సహకరించి అన్ని వార్డులను అభివృ ద్ధి చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నాయకులకు ఆయన సూచించారు.
ప నిచేస్తున్న అధికారులను తప్పు పట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇందిరమ్మ గృహాలు రా నివారు ఇంకా ఎవరైనా ఉంటే రాబోయే రో జుల్లోదరఖాస్తు చేసుకుంటే మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుమన్ రా వు, పలువురు అధికారులు, పాల్గొన్నారు.
సఫాయిమిత్ర వాహనాలు పంపిణీ
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మున్సిపల్ అధికారులకు సఫాయిమిత్ర వాహనాలను అం దజేశారు. సిబ్బంది వాహనాలను సద్వినియోగం చేసుకొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, లక్ష్మ ణ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.