30-05-2025 12:35:05 AM
- జిల్లాలో సరిపడా రేషన్ అందుబాటులో
- జూన్ నుంచి పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు
- మూడు నెలల ముందస్తు బియ్యం పంపిణీ పట్ల అవగాహన తప్పనిసరి
వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబందించి పేద ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవద్దని ఉదేశ్యంతో మూడు నెలలకు సంబం దించిన రేషన్ బియ్యాన్ని అందించాలని కేం ద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను సమాయుక్తం చేసింది.
వనపర్తి, మే 29 ( విజయక్రాంతి ) : జూన్, జులై, ఆగస్టు మూడు నెలలు వర్షాకా లం కావడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి అలుగులు పారడం రైతన్నలు, వ్యవసాయ కూలీలు, అనుబంధ రంగాలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కా వడం నిరుపేద ప్రజలు తమ పనుల్లో బి జీగా ఉండడం వర్షాలు పడుతున్న సమయంలో సకాలంలో రేషన్ దుకాణాలకు బి య్యం సరఫరా కాకపోవడం ఇలా పలు కారణాల వల్ల రేషన్ బియ్యం తీసుకోవడం కాస్త జాప్యం జరుగుతుంది.
సామాన్య ప్రజలు, నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణిలో ఎ లాంటి ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు సంబందించిన రేషన్ బియ్యం ను ఒకేసారి పంపిణి చేయాలని నిర్ణయం తీసుకుంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కు ఉత్తర్వులు జారీ చేయగా అందుకు అనుగుణంగా జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులను సమాయుక్తం చేసింది.
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణి చేయడం ద్వారా రవాణా సమస్య లతో పా టు రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇలా చేయడం వల్ల రవాణా చా ర్జీల ఖర్చు తగ్గడంతో పాటు డీలర్లకు, హమాలీలకు కూలి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లను చేసుకుంటుంది. ప్రస్తుతం భారీ మొత్తంలో రవాణా చేసినందుకు వారి వద్దనున్న వాహనాలతో సాధ్యమేనా అన్న ప్రశ్న సైతం తలెత్తుతుంది.
మూడు నెలల ముందస్తు బియ్యం పంపిణీ పట్ల అవగాహన తప్పనిసరి
వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బి య్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు రం గం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కా నీ పంపిన పట్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు అవగాహన తప్పనిసరిగా కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది .
సాధారణంగా రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ షాపుల వద్దకు వెళ్లి వేలిముద్రలో లేదా ఐరిస్ ద్వారా రేషన్ బియ్యం పొందుతుంటారు. ఒకసారి వెలుముద్ర లేదా హరి ద్వారా ఒక నెలకు సంబంధించిన రేషన్ మాత్రమే వస్తుంది.
మూడు నెలలకు సంబంధించి మూడుసార్లు వేయాల్సి ఉం టుంది ఈ విషయంపై సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన కల్పించడంలో విఫలమైతే రెండు నెలల రేషన్ బియ్యం మాయమయ్యే అవకాశాలు సైతం మెండుగా ఉన్నాయి.
జిల్లా వివరాలు .....
జిల్లా వ్యాప్తంగా 161316 రేషన్ కార్డులు ( 10214 అంత్యోదయ కార్డులు, 10724 70 ఎఫ్ ఎస్ సి కార్డులు, 109 అన్నపూర్ణ కార్డులు ) ఉండగా 558334 మంది లబ్ధిదారులకు గాను 10555.422 మెట్రిక్ టన్ను ల బియ్యం ప్రతినెల సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో సరిపడా రేషన్ బియ్యం అందుబాటులో...
మూడు నెలల రేషన్ బియ్యం ను రేషన్ షాపుల ద్వా రా అందించేందు కు సరిపడ బియ్యం వనపర్తి జిల్లాలో అందుబాటులో ఉంది. వనపర్తి జి ల్లాలో వరి వరి పంటను అత్యధికంగా పండించడం వల్ల బియ్యం కొరత సమ స్య ఉండదు. రేషన్ తీసుకునే లబ్ధిదారులు విధిగా మూడుసార్లు వేలిము ద్రలు వేయాల్సి ఉంటుంది అప్పుడే మూడు నెలల రేషన్ బియ్యం అందుతుంది. ఈ విషయంపై రేషన్ డీలర్లకు సైతం సూచనలు చేయనున్నాం.
కాశి విశ్వనాధ్, పౌర సరఫరాల శాఖ అధికారి, వనపర్తి జిల్లా