30-05-2025 12:43:04 AM
ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన
సదాశివపేట, మే 29 : ఓ ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన గురువారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చోటు చేసుకుంది. మృతురాలు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మునిపల్లి మండలం కవ్వంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ (45) అనారోగ్యంతో రెండు రోజులు క్రిందట పట్టణంలోని ఎస్ఎన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందన్నారు.
గురువారం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని, మెరుగైన చికిత్సకు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పారన్నారు. అప్పటికే అన్నపూర్ణ మృతి చెందిదని కుటుంబీకులు తెలిపారు. డాక్టర్ల నిర్లక్షం వల్లే మహిళ మృతి చెందిందని హాస్పిటల్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఎస్ఎన్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.