08-06-2025 12:53:24 AM
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): నిధులను మళ్లించేందుకే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ను చేపట్టిందని, బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తి వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం బరాజ్ వైఫల్యానికి కేసీఆర్, హరీశ్రావే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. 2018 దాకా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి..
నాసిరకం పనులు చే పట్టి, ప్రజాధనం దుర్వినియోగం చేసినందు కు ప్రజలకు బేషరతులుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడికి దిగడానికి హరీశ్రావుకు సిగ్గూశరం లేదా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్ అవాస్తవిక ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రచారానికి అంశాల వారీగా కౌంటర్ ఇస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలేనని ఈ సంద ర్భంగా ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అనిచెప్పింది మీరేనని బీఆర్ఎస్పై మండిపడ్డారు. ఆ బరాజ్ నుంచి ఎత్తిపోసిన నీరే కాళేశ్వరం నీటిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
2019లో బ్యారేజీ నిర్మాణం పూర్త యిందని... 2019--20లో 61 టీఎంసీలు, 2020-21లో 31.82 టీఎంసీలు, 2021--22లో 33 టీఎంసీలు, 2022--23లో 25.97 టీఎంసీలు, 2023--24లో 8.93 టీ ఎంసీలు మొత్తం కలిపి 162 టీఎంసీ నీటిని మాత్రమే మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారని తెలిపారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే స ముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలన్నా రు. ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇచ్చారో చెప్పాలని డి మాండ్ చేశారు.
2022, జూలైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్హౌస్ నీట ము నిగిందన్నారు. అదే ఏడాది కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్ హౌస్ ట్రెస్ట్ వాల్ కూలి పంప్ హౌస్లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయన్నా రు. ఆ సంవత్సరం 25 టీఎంసీలే ఎత్తిపోశారని.. 2023, అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బరాజ్ కుంగిందన్నారు. నీటి మళ్లింపు కోస మే బరాజ్లు కడతారని.. ఫరక్కా బరాజ్ని కట్టింది నీటి మళ్లింపు కోసమేనన్నారు.
రాతి పునాది వల్లే ఆ బరాజ్ మనుగడ సాగిస్తోందన్నారు. 1975లో ఫరక్కా బరాజ్ కట్టినా.. ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు ప్రతిపాతన, నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ ఎస్ హయాంలోనేనని గుర్తుచేశారు. ఫరక్కా బరాజ్ని నీటి మళ్లింపు కోసం కడితే కాళేశ్వరం బరాజ్లు కట్టింది నిధుల మళ్లింపు కోసమని... కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బరాజ్లే ప్రత్యక్ష సాక్షమన్నారు.
తుమ్మడిహెట్టి ఎందుకు కట్టలేదు..
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కడతామని మహారాష్ర్టతో ఒప్పందం చేసుకొని ఏనుగులతో ర్యాలీలు తీయలేదా... బరాజ్ కట్టకుం డా ఎందుకు పక్కనపెట్టారని ఉత్తమ్ ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి కడితే పేరు కాంగ్రెస్కు వస్తుందని, వారికి డబ్బులు దోచుకునే అవకాశముండదనే ఆ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కి.మీ. ఓపెన్ కెనాల్ నిర్మాణం జరిగిందన్నారు.
తుమ్మిడిహెట్టి బరాజ్ కడితే 100 కి.మీ దాకా గ్రావిటీతో నీళ్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. మేడిగడ్డ వల్ల 100 కి.మీ. కిందికి వెళ్లి.. నీటిని ఎత్తిపోవడం, వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేయడం ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు తిప్పిపోతల పథకమని నిరూపించారని తెలిపారు. ఐదేళ్లలో 162 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. 62 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలేయడానికి కట్టిన పథకమని అభివర్ణించారు.
శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, సింగూరు రిజర్వాయర్లు బీఆర్ఎస్ హయాంలో కట్టలేదని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని... రాష్ర్టం ఏర్పడే నాటికీ ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు కింద రూ.6150 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. 2016 నాటికి రూ.11,678 కోట్లను ఖర్చుచేసినట్టు గుర్తుచేశారు.
నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదు...
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం పచ్చి అబద్ధమని.. ఏ రోజు కూడా సీడబ్ల్యూసీ చెప్పలేదన్నారు. కాసుల కక్కుర్తితో పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావొద్దనే కారణాలతోనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ రూ.38 వేల కోట్లతో పూర్తయితే, ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కొనసాగించి ఉంటే.. ఆదా అయ్యే రూ.62 వేల కోట్లతో ఇప్పటికే పాలమూరు -రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమ, ఎస్ఎల్బీసీ, డిండి, సీతారామ, దేవాదుల , ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పూర్తయ్యేవన్నారు. నీటిపారుదలకు తీసుకున్న అప్పులకు ఏటా రూ.16 వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తోందన్నారు.
వడ్డీల భారం తెలంగాణ ప్రజలపై మిగలడానికి మీరే కారణమంటూ హరీష్ రావుపై మండిపడ్డారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిచిన ప్పుడు విద్యుత్ భారమే ఏడాదికి రూ.10 వేల కోట్లు అయ్యే పరిస్థితి ఉందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే.. విద్యుత్ భారం కేవలం రూ.1000 కోట్లు అయ్యేదని.. అన్ని విధాలుగా మీ తప్పుడు నిర్ణయాలకు తెలంగాణకు ఆర్థిక భారం శాశ్వతంగా నిలిచిపోయిందన్నారు.