08-06-2025 12:50:26 AM
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): కాళేశ్వరం డిజైన్ బాధ్యత పూర్తిగా కేసీఆర్దేనని, ఆయన తానా అంటే.. ఇంజినీర్లు తంద నా అన్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజై నింగ్ చర్చలో హరీశ్రావు, ఈటల లేరని, కానీ తాను మాత్రం పలుమార్లు ఆ సమావేశాలకు వెళ్లినట్టు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లా డారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనదని, దీనివల్ల చేవెళ్లకు చుక్క నీరు రాదని తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడే చెప్పినట్టు విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేవలం మాయమాటలు చెప్పి అప్పట్లో అధికారంలోకి వచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాణ హిత ప్రాజెక్ట్కు వాడుకుందని ఆరోపించారు. కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ను రద్దు చేస్తారనుకుంటే.. అంబేద్కర్ పేరు తీసి, కాళేశ్వరం అని పేరు పెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ డిజైన్ బాగానే ఉందని, కానీ కేసీఆర్ కాళేశ్వరం పేరిట చేసిన డిజైన్ సరైంది కాదన్నారు. ఈ ప్రాజెక్టులో ఈటలకు ఏ మాత్రం ప్రమేయం లేదన్నారు. ఈటల, కేసీఆర్ను ప్రొటెక్ట్ చేశారనడం వంద శాతం తప్పని... గులాబీ జెండా అందరిది అని అన్నందుకు ఈటలను పార్టీ నుంచి వెళ్లగొట్టారని గుర్తు చేశారు. ఇంత పెద్ద అవినీతి జరిగినా ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కా రు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజె క్టు అంశంలో ఈటల పాత్ర జీరో... అయితే తాను ఈటలకు సపోర్టు చేసేందుకు ఈ స మావేశం ఏర్పాటు చేయలేదన్నారు. కేవలం నిజాలు చెప్పేందుకు వచ్చానని తెలిపారు.