10-09-2025 12:01:51 AM
ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు
మహబూబాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల చైతన్య స్ఫూర్తి కాళోజీ నారాయణరావు అని, కాళోజి రచనలతో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.
అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు హాజరై మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ కోసం జరిగిన అనేక ఉద్యమాలలో పాల్గొనటమే కాకుండా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప ప్రజా కవి అని అన్నారు.
కాళోజీ జయంతిని పురస్కరించుకొని పాఠశాల, కళాశాల స్థాయిలలో ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించి, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ,
గౌరవ సలహాదారులు మైస నాగయ్య, ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణు వర్ధన్, బాలికల కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం, హెల్త్ డిపార్ట్మెంట్ క్షయ వ్యాధి నిర్మూలన ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయ్ కుమార్, సిహెచ్వో తోట శ్రీనివాస్, మార్నేని వెంకన్న , ఎడ్ల వేణు, పెద్ది వెంకన్న, కోట సుధాకర్, పరమాత్మ చారి, మధుసూదన్ రావు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో..
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి నరసింహస్వామి, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.