28-06-2025 12:18:21 AM
ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతోపాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో మన భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు భాగమ్యారు. ఆస్కార్ అకాడమీలోకి వీరికి ఆహ్వానం లభించింది. ఆస్కార్కు నామినేట్ అయ్యే సినిమాల్లో తుది ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు వేసే అవకాశాన్ని ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా 534 మంది సభ్యులను ఆహ్వానించినట్టు అకాడమీ తెలిపింది. మొత్తం 19 ఇతర విభాగాల్లోని నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలను ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానించింది. ఆస్కార్ అకాడమీలో చోటుపొందినవారి జాబితాను తాజాగా విడుదల చేయగా..
ఇందులో 41 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ముఖ్యంగా నటుడు కమల్హాసన్, ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్ క్లబ్లో చేరారు. వీరితోపాటు దర్శకురాలు పాయల్ కపాడియా, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ వేడుక జరగనుంది. జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుండగా, నామినేషన్ల పరిశీలన తర్వాత అదే నెల 22న తుది జాబితాను ప్రకటిస్తారు.