28-06-2025 12:19:24 AM
మల్టీ టాలెంటెడ్ స్టార్ ఎస్జే సూర్య పదేళ్ల విరామం తర్వాత దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజాచిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాలో ఎస్జే సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ తానే సమకూరుస్తున్నారు. శ్రీ గొకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషల్లో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొకులం మూవీస్.
ఈ సినిమాతో తమిళ సినీరంగంలో కమ్బ్యాక్ ఇస్తోంది. వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ ఈ చిత్రానికి సహ నిర్మాతలు కాగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ‘వాలి’, ‘ఖుషీ’, ‘న్యూ’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్జే సూర్య ఈ సినిమాకు స్టార్ స్టడెడ్ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా మిగతా తారాగణం, సాంకేతిక బృందం, కథా నేపథ్యం వంటి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.