28-06-2025 12:16:59 AM
ఆసక్తికరమైన కథతో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి వస్తున్న మరో చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కట్స్తో ‘యూ/ఏ’ సర్టిఫికెట్ లభించే అవకాశం ఉన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ‘ఏ’ సర్టిఫికెట్ తీసుకున్నట్టు మూవీటీమ్ తాజాగా ప్రకటించింది.
ఇటీవల ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దిల్ రాజు.. ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో స్పష్టంగా చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి కంప్లీట్ ఎంటర్టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలకే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారని తెలిపిన ఆయన.. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు ఒక కొత్త తరహా సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు ‘తమ్ముడు’ సర్టిఫికెట్ విషయంలో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.