15 March, 2026 | 8:18 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి

28-10-2025 09:07 PM

బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం చేయడం సరైనది కాదు

బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ

గరిడేపల్లి (విజయక్రాంతి): కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే 42% రిజర్వేషన్ పరిమితం చేయకుండా, విద్య, ఉపాధి రంగాల్లో కూడా కట్టపరంగా రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

దీనికోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలలో చేర్చి బాధ్యతను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసగించడం సరైంది కాదని ఆయన విమర్శించారు. బీసీ సమాజం హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాటం సాగిస్తుందని, బీసీలకు న్యాయం చేయకుండా వెనకడుగు వేస్తే బీసీ వ్యతిరేక నాయకులకు తగిన విధంగా గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.