calender_icon.png 15 June, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి కలెక్టర్ కు బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు

14-06-2025 06:54:23 PM

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్..

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) బ్లడ్ డోనర్ అవార్డును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma) చేతుల మీదుగా శనివారం అందుకున్నారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు మాత్రమే ఈ అవార్డు రావడం గమనార్హం. గత సంవత్సరంనుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా చేసిన సేవలకుగాను ముఖ్యంగా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రక్తదాన శిబిరాలు ప్రభుత్వపరంగా నిర్వహించడం వలన ఈ ప్రత్యేక అవార్డు పొందారు.

ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఎం రాజన్నతో  కలిసి  జిల్లా అధికారులు అందరితో  రక్తదాన విషయంలో  సమీక్ష జరిపేవారు. ప్రతి జిల్లా అధికారులు వారి సిబ్బంది తప్పక రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని మోటివేట్  చేయడం మూలంగా ప్రతి నెల రెండు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది విరివిగా రక్తదానం చేస్తున్నారు. ఇలా సేకరించిన రక్త యూనిట్లను  జిల్లాలోని పేద ప్రజల ఆరోగ్య అవసరాల కొరకు వినియోగిస్తున్నారు.

అవార్డును స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మాట్లాడుతూ...  జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి ప్రజల ఆరోగ్య అవసరాల నిమిత్తం అందించినందుకు చేసిన కృషికిగాను గవర్నర్ అవార్డు రావడం గర్వకారణమని, జిల్లా కలెక్టర్ గా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు, రక్తాన్ని స్వీకరించడంలో తనతో పాటు కృషిచేసిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, స్టేట్ ఎంసీ మెంబర్ సంజీవరెడ్డి, ఐఆర్సిఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులు, జిల్లా ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇకముందుకూడా రక్త సేకరణ కార్యక్రమాల్ని, ఈ సేవలను కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్  తెలిపారు.