calender_icon.png 15 June, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్, బ్యాంకుల ఆగడాలు అరికట్టాలి..

14-06-2025 06:43:19 PM

సిపిఐ డిమాండ్..

కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచర్ల జమలయ్య, మునగడప వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రామవరంలోని ఏడు వార్డుల బాధితులు, మేషన్ కాలనీ, ప్రశాంత్ నగర్ పంచాయతీ తదితర ప్రాంతాల్లోని మైక్రో ఫైనాన్స్ బాధితులు సిపిఐ నాయకులను సంప్రదించి వారు కష్టాలను, ఫైనాన్స్ బ్యాంకులు పెట్టే ఇబ్బందులను వారికి వివరించారు. రామవరం పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు,భూక్య శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ బ్యాంకుల బాధితులతో సమావేశమై  మాట్లాడారు.

ప్రైవేట్ బ్యాంకులో ఏజెంట్లు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చి ,నిబంధనలకు వ్యతిరేకంగా లబ్ధిదారులపై దాడులకు దిగటం చట్టరీత్య నేరమని అన్నారు. మహిళల యొక్క మానసిక స్థితిపై దౌర్జన్యాలు చేస్తున్నారని వారి యొక్క ఆగడాలను మానుకోకపోతే సిపిఐ ఆధ్వర్యంలో,వారికి తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫైనాన్స్ నిబంధనలో ఉన్న ఇన్సూరెన్స్, వైద్యం మొదలైన సౌకర్యాలు ఉన్నాయని మాయ మాటలు చెప్పి పేద మధ్య తరగతి ప్రజలకు విచ్చలవిడిగా రుణాలు అందించి వారు కట్టలేని స్థితిలో వారిపై దౌర్జన్యానికి ,గొడవలకు దిగటం సరికాదని హెచ్చరించారు. వర్షాకాలంలో పనులు దొరకక స్కూల్ పిల్లలు బుక్స్, ఫీజులు కట్టే టైంలో వాళ్లు నాలుగు నెలలు గడువు అడుగుతున్నారు తప్ప, ఇచ్చిన అప్పును చెల్లించమని వారు చెప్పటం లేదని అన్నారు. తక్షణమే వారికి నాలుగు నెలల గడువు రుణాలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేశారు.

ఏజెంట్లు ఒక వ్యక్తికి ఎన్ని రకాల లోన్లు ఇవ్వచ్చో లేదా ఎన్నైనా ఇవ్వచ్చా మరి నిబంధనలో లేదా! అని  పరిశీలించుకోకుండా! రకరకాల లోన్లు బాధితులకు అందించి,వాళ్లు రుణాలు చెల్లించలేని స్థితి కి నెట్టటం  కమిషన్ల కోసం కాదా అని ప్రశ్నించారు. తక్షణమే మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకుల ఏజెంట్లు వారి పద్ధతులు మార్చుకొని చట్ట పరిధిలో వారి విధులను నిర్వహించాలని వారికి సూచించారు .ఎవరైనా ఏజెంట్లు మహిళలకు ఇబ్బంది కలిగిస్తే, వెంటనే వందకు సమాచారం అందించి వారి నుండి తక్షణ రక్షణ పొందాలని బాధితులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తూముల శ్రీనివాస్ ,కనుకుంట్ల శ్రీనివాస్, జంజర్ల కృష్ణమూర్తి ,సర్ప వీరభద్రం ,మహిళా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.