calender_icon.png 15 June, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘చేగువేరా’ స్పూర్తితో ఉద్యమించాలి

14-06-2025 06:57:26 PM

సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శిసాదుల శ్రీనివాస్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): చేగువేరా స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని మహబూబాబాద్ సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల శ్రీనివాస్(CPM District General Secretary Sadula Srinivas) పిలుపునిచ్చారు. సీపీఎం పట్టణ కమిటీ అధ్వర్యంలో చేగువేరా జయంతి సందర్భంగా పాత కలెక్టర్ ఆఫీస్ ఏరియాలో ఉన్న సిపిఎం భూ పోరాట కాలనీకి చేగువేరా నగర్ గా నామకరణం చేసి బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రపంచ స్థాయి విప్లకారుడు చేగువేరా అడుగుజాడల వైపు ప్రపంచ యువత ఆకర్షితులు అవుతున్నారన్నారు. ఆయన స్పూర్తితో సామ్రాజ్య వాదానికి, కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యడంలో విఫలమౌతున్నారని, అర కొర పథకాలు మాత్రమే అమలవుతున్నాయని, పూర్తి స్థాయిలో అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ లు ఇవ్వకుండా కాలయాపన చెయ్యడం దారుణమన్నారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ధరణి తో రాష్టంలో ఉన్న మిగులు భూములను ఆక్రమించుకున్నారని, ఆ స్థానంలో భూ భారతి పథకాలను తెచ్చి రైతులు సేద్యం చేస్తున్న భూములకు పెట్టాలిస్తామని హామీలు ఇస్తున్నారని, వాటిని అమలు చెయ్యడంలో అధికార పార్టీ అధికారులు చిత్త శుద్ధి తో వ్యవహారించాలని డిమాండ్ చేసారు.

కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మత రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు. ఉచిత పథకాలతో ప్రజలను మభ్య పెడుతున్నాయి ప్రతి సంవత్సరం యువతకు 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని , ఇతర దేశాలలో నల్ల డబ్బు లక్షల కోట్ల రూపాయలు  వెనక్కి తెప్పించి పేదవాళ్లకు 0 అకౌంట్ లో 15లక్షలు వేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆపేరేషన్స్ కగార్ పేరుతో కామ్యూనిస్ట్ లను దేశంలో లేకుండా చెయ్యడం కోసం వందలది మంది మావోయిస్టు లను ఏరివేత కార్యక్రమం చేపట్టి, అమాయక గిరిజనులను చంపేస్తుందని, చిత్త శుద్ది ఉంటే చర్చలు చరపాలని డిమాండ్ చేసారు.

జూన్ 14 1928 అర్జంటినాలో జన్మించిన చేగువేరా ప్రపంచంలో ఉన్న మానవాళికి ఆదర్శం అయ్యాడని, విద్య, వైద్యం, కుడు, గూడు, అన్ని అందరికీ అందాలని,  భూమి, నీరు ఏ ఒక్కరికి సొత్తు కాదని ప్రజలందరికీ సమానమేనని ప్రపంచ దేశాలలో మోటార్ సైకిల్ మీద తిరిగి పెట్టుబడి దారులకు, సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా కమ్యూనిజాన్ని నిర్మించిన గొప్ప విప్లవకారుడు చేగువేరా అయన స్పూర్తితో ఈ కాలనీ వాసులు ఎక్కడ అన్యాయం జరిగిన వాటి పరిష్కారానికై ఉద్యమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్, పట్టణ కమిటీ సభ్యులు కుమ్మరి కుంట్ల నాగన్న, చాగంటి భాగ్యమ్మ బానోతు వెంకన్న, తోట శ్రీను, ఎర్ర శ్రీను, ఎండి రజాక్, పి.వెంకన్న మహేందర్ పాల్గొన్నారు.