05-07-2025 12:15:22 AM
పలు సూచనలు చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సౌజన్య
సంగారెడ్డి, జూలై 4(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుచనలతో జిల్లా న్యాయ సేవాాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య కందిలోని సెంట్రల్ జైలులో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి సెంట్రల్ జైలులోని బేరక్లు, గదులు, వంట గది, బాత్రూంలు, జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించి ఖైదీలను జైలులో ఉన్న సదుపాయాలను, భోజనం గూర్చి అడిగి తెలుసుకున్నారు. అన్ని ఖైదీల బేరక్లను క్షుణంగా పరిశీలించి వారికి కావాల్సిన అవసరాలు, సదుపాయాలు అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ కు సూచించారు.
కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలిపారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా పరిశీలించారు. ఈ తనిఖీలో జైలు సిబ్బంది పాల్గొన్నారు.