14-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల , జూన్ 13 (విజయక్రాంతి); రాజన్న కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.శుక్రవారం వే ములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన లోని గోశాలలో కోడె ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి, అర్హులైన రైతులకు యా బై జతల కోడెలను వంద జీవాలను అధికారులు రైతులకు పంపిణీ చేశారు.
ఇప్పటి దాకా మొత్తం 375 జతలు..750 జీవాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ గోశా ల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వాటిని పక్క దారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పక్కాగా చూడాలని సూచించారు. వా టిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా వ్య వసాయ అధికారి అఫ్జల్ బేగం , జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశా ల కమిటీ సభ్యులు రాధా కృష్ణ రెడ్డి, పశు వైద్యాధికారులు తదిరులు పాల్గొన్నారు.