30-06-2025 05:08:40 PM
దళితులందరూ ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలి..
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. పిడమర్తి రవి..
మణుగూరు (విజయక్రాంతి): పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Former MLA Rega Kantha Rao) దళిత వ్యతిరేక విధానాలు విడనాడాలని, లేదంటే రాబోయే కాలంలో దళితులు తమ ఓట్లతో తగిన బుద్ధి చెబుతారని, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. పిడమర్తి రవి(Former Chairman of SC Corporation Dr. Pidamarthi Ravi) హెచ్చరించారు. సోమవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. మల్లెలమడుగు గ్రామంలో 2022లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నాడు ఎమ్మెల్యేగా ఉన్న కాంతారావు అడ్డుకొని దళితులను ఘోరంగా అవమానించారన్నారు. తనతో పాటు దళిత నాయకులపై దాడి చేయించి, దళిత వర్గాలపై కేసులు పెట్టించి దళిత ద్రోహిగా అపకీర్తిని మూటగట్టుకున్నారన్నారు.
విగ్రహ ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ కొందరు ధర్నాలు చేసారని, వారెవరిపై కేసులు పెట్టకుండా దళితులపైన మాత్రమే కేసులు పెట్టించి, అగ్రవర్ణాలకు అండగా వారి పక్షన నిలిచారని ఆరోపించారు. దళితులకు కాంతారావు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో దళితులంతా ఏకమై దళిత ద్రోహి కాంతరావు ఓట్లతోనే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఆయనను ఓడించి తీరుతామని, శబదం చేశారు. ఈ కార్యక్రమంలో దెపంగి వెంకటరమణ, నరసింహారావు, వెంకన్న, వెంకట్ పాల్గొన్నారు.