23-04-2025 07:45:11 PM
కాటారం (విజయక్రాంతి): కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు వారిలోని నైపుణ్యతను, నిబిడీకృతమై ఉన్న కళలను వెలికి తీయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని కేజీబీవీ ప్రత్యేక అధికారిని చల్లా సునీత అన్నారు. బుధవారం కాటారం కేజీబీవీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వీడ్కోలు సందర్భంగా పిల్లలు పలు సాంస్కృతిక విన్యాసాలు ప్రదర్శించారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందజేశారు.
స్వీయ కవితలు, కథలు, చిత్రలేఖనం, విద్యార్థుల యొక్క లక్ష్య సాధన గుర్తించే విధంగా చార్టుల ద్వారా ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. బాల్యవివాహాలు అంశంపై ప్రిన్సిపాల్ సునీత రచించిన బుర్రకథని 9వ తరగతి అక్షయ బృందం ప్రదర్శించారు. అనంతరం ఇంటర్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ, సరిత, అరుణ, సుజాత, మణిమాల, రాజమణి, స్వప్న, కవిత, శ్రీలత శిరీష నలిని, రాజేశ్వరి, లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.