23-04-2025 07:47:54 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో బుధవారం నిర్వహించిన నాభిశిల బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో గ్రామదేవతల పండుగలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, మాజీ జడ్పిటిసి బట్టా విజయ గాంధీ, మాజీ సర్పంచ్ కొర్స లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.