కట్ట ప్రణతికి జేఎన్టీయూ బంగారు పతకం..
రైతు బిడ్డ కష్టానికి ప్రతిఫలం..
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెనగడప గ్రామానికి చెందిన కట్ట సత్యనారాయణ-రజని దంపతుల రెండవ కుమార్తె కట్టా ప్రణతి జేఎన్టీయూ మంథని(JNTUH College of Engineering Manthani)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ క్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రణతికి ఇటీవల హైదరాబాద్ జేఎన్టీయూలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma) బంగారు పథకాన్ని అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రణతి మాట్లాడుతూ... భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని, అమ్మానాన్న పడ్డ కష్టాన్ని జీవిత కాలం గుర్తుపెట్టుకుంటూ, వారు చూపిన బాటలో నడుచుకుంటూ కుటుంబానికి దేశానికి మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేస్తానన్నారు. బంగారు పతకం సాధించిన తర్వాత,నాపై బాధ్యత మరింతగా పెరిగిందని, భవిష్యత్తులో నా లక్ష్యం గ్రూప్స్ వైపు,యూపీఎస్సీ వైపు గురి పెట్టి ఉన్నత లక్ష్యాన్ని సాధించి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తానన్నారు.






