07-06-2025 08:01:25 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కించపరిచిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మండిపడ్డారు. శనివారం జగిత్యాలలో కవిత మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని గతంలో విమర్శించిన కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో ఉన్న అన్ని డీఏలు, టీఏలను క్లియర్ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తి చేశారు.
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తన హామీలన్నింటిని మరచిపోయిందని, పెండింగ్లో ఉన్న డీఏలను చెల్లించడానికి బదులుగా, కేవలం ఒకే విడత డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) మంజూరు చేసిందన్నారు. దీంతో తెలంగాణ ఉద్యమ(Telangana Movement) సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన త్యాగాలను అవమానించడమేనని కవిత అభివర్ణిస్తూ, ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కవిత మల్లియాల్, కొడిమ్యాలలో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఇవాళ జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం రంగాపూర్ లో మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ హరిచరణ్ రావు తండ్రి సురేందర్ రావు దశ దినఖర్మకు హాజరై వారికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.