30-06-2025 02:39:43 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఒక పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో( Telangana Factory Blast) పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.
మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్(KCR) తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాశమైలారం పేలుడు ఘటనపై మల్టీ జోన్ ఐజీ(Multi-Zone IG Satyanarayana) వివరాలు వెల్డించారు. పాశమైలారం ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారని చెప్పారు. ఈ ప్రమాదంలో 26 మందికి గాయాలయ్యాయని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. మొత్తం పరిశ్రమలో 150 మంది కార్మికులు ఉన్నారని, ప్రమాదం జరిగిన బ్లాక్ లో 90 మంది ఉన్నారని తెలిపారు. పరిశ్రమ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఐజీ సత్యనారాయణ సూచించారు.