02-02-2026 12:26:29 AM
సిఎం దిస్టిబొమ్మ దహనం హేయమైన చర్య
కోనరావుపేట,ఫిబ్రవరి 1(విజయక్రాంతి):- చట్టానికి కేసిఆర్ అతిధుడు కాదని, ఎవరైనా వారి స్థాయి ఏదైనా సమస్యపై ప్రశ్నించిన సమయంలో హాజరు కావలసిందే ని, తెలంగాణ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం అమానుష్యమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మం డల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఫాష అన్నారు. ఆదివారం కోనరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పా ర్టీ శ్రేణులతో కలిసి బారాస పార్టీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్బంగా ఫాష మాట్లాడుతూ కెసిఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన సమయంలో మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని విమర్శించాడు.రాష్ట్ర ప్రభుత్వంలో సీట్ ఒక బాగమని, మొన్న కేటీఆర్, నిన్న హరీష్ రావు,నేడు కేసీఆర్ లను సిట్ శాఖ చట్ట బద్దంగా వారు పిలిచారాని, కేసీఆర్ ను కూడా ఆదివారం సీట్ కేసీఆర్ ను పిలిచారాని, దీనిని ఏదో రాష్ట్రానికే అన్యాయం జరిగిందన్నటు సిఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం బారాస పార్టీకి సబబు కాదని అయన అన్నారు.
కేసీఆర్ తెలంగాణ తెస్తే, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మం దాల లింబయ్య,యూత్ మండల అధ్యక్షులు బండి ప్రభాకర్, నాయకులు కర్రోళ్ల భాస్కర్, నాలుక సత్యం,బండ నర్సయ్య, బొర్ర రవీందర్,గోపాల్, నర్సింహాచారి, శోభన్, లింబా ద్రి,అంబటి శేఖర్, వంకాయల ప్రశాంత్, ధర్మయ్య, పెంతల శ్రీనివాస్, ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.