16 April, 2026 | 4:14 PM

Breaking News

నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి   •   ప్రజా పాలన మండల స్థాయి సమావేశం   •   సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు   •   సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం   •   మహిళా రిజర్వేషన్ బిల్లు— ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక   •   డీలిమిటేషన్, సవరణ బిల్లులపై ప్రతిపక్షాల నిరసన.. లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం   •   మున్సిపల్‌లో పైసల పంచాయతీ   •   మహిళా కోటా బిల్లుపై వాడివేడి చర్చ.. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకు?   •   మార్కుల విషయంలో నిరాశ.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య   •  

తెలంగాణ సాధించిన కారణ జన్ముడు కేసీఆర్

18-02-2026 12:00 AM

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం

సికింద్రాబాద్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దినోత్సవ వేడుకలు ఓల్ బోయిన్‌పల్లి తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 72వ జన్మ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ధవరాం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేలా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహానేత కెసిఆర్. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి వర్గానికీ మేలు చేశాయి.

ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేసి వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. మహిళల సాధికారత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని పేర్కొన్నారు. అలాగే కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బోయిన్ పల్లి డివిజన్లో తాజా మాజీ కార్పొరేటర్ ము ద్దం నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పేదమహిళలకు సుమారుగా 1200 వందల మంది కి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.