calender_icon.png 12 June, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ

11-06-2025 01:07:16 PM

హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో(Kaleshwaram Lift Irrigation Project) జరిగిన అవకతవకలకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) బుధవారం హైదరాబాద్‌లోని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) ముందు హాజరయ్యారు. కాగా, కాసేపటి క్రితమే బీఆర్కే భవన్ లో కేసీఆర్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Kaleshwaram Project Power Point Presentation) నివేదికను కమిమిషన్ కు అందించారు. కేసీఆర్ ను 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారించింది. మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కేసీఆర్ కోరారు. బీర్కే భవన్ నుంచి కేసీఆర్ హరీశ్ రావుతో కలిసి కారులో వెళ్లారు. అందరికీ అభివాదం చేసి బీర్కే భవన్ నుంచి కేసీఆర్ బయలుదేరారు.