02-01-2026 01:15:06 AM
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి) : మళ్లీ వచ్చేది కేసీఆరేనని, కాంగ్రెస్ పాలన తిరోగమనంలో సాగు తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గెలుపులు, ఓటములు శాశ్వతంకావని, అవి తాత్కాలిక మని, అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయని, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం, గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతమని గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భావోద్వేగభరితమైన ప్రసంగం చేశారు. క్యాలెండ ర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని విమర్శించారు. రెండేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు, తిరో గమ నం వైపు ప్రయాణిస్తున్నదని అన్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితు లు, కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. నేడు పండుగ చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలికాలంలో కూడా గంటల తరబడి, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, కేంద్రంతోనూ, స మైక్యవాదులతోనూ 14 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని కేటీఆర్ స్మరిం చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలన లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు.
కేసీఆర్ను సీఎంగా చూడటమే లక్ష్యం..
గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని కేటీఆర్ కొనియాడారు. జెండాను చేత బట్టి నడిపించే నాయకుల కంటే, ఆ జెండా ను భూమిలో నిటారుగా పాతి ఇది నా జెండా అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని ఆయన పేర్కొన్నారు.
పం చాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి పోరాటం వరకు, లగచర్లలో గిరిజ నులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన తీరుకు వ్యతిరేకంగా, రైతుబంధును రెండు సార్లు ఎగ్గొట్టిన అన్యాయంపై, ‘ఆరు గ్యారంటీలు 420 హామీలు’పై ప్రజా తిరుగుబాటు కు నాయకత్వం వహించిన కార్యకర్తలను కేటీఆర్ అభినందించారు.
మూసీ నది పరివా హక ప్రాంతాల్లో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తిన సోదరులను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూము ల ఆక్రమణకు నిరసనగా నిలిచిన విద్యార్థులను, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అన్యాయానికి ఎదురు నిలుస్తున్న తెలంగాణ తమ్ముళ్లను, ఆడబిడ్డలను ప్రత్యేకంగా స్మరించారు. 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభసందర్భంలో ఒకటే విషయం గుర్తుం చుకో వాలని పిలుపునిచ్చారు.
ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆటలా ఉంటే, తెలంగాణ సాధించిన బీఆర్ఎస్కు రాజకీయాలు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మమని, ఒక విధి అని కేటీఆర్ తెలిపారు. గెలుపు-ఓటములతో సంబం ధం లేకుండా పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగాలని అన్నారు. ఈ ఏడాది ఒక వైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా అవస రమని కేటీఆర్ స్పష్టం చేశారు. పోరాటం, నిర్మాణం రెండింటినీ ఆధారంగా చేసుకుని ముందుకుసాగాలని, ధర్మం, న్యాయం, నిజాయితీ తమ వైపే ఉన్నాయని, అందుకే విజ యం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్రం, రాష్ట్రం కలిసి రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్పై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వా దం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కు ట్రలు, కుతంత్రాలు జరిగినా బీఆర్ఎస్ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. 2028 లో తిరిగి కేసీఆర్ను సీఎంగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్య మని, అదే తమ ధ్యేయమని స్పష్టం చేస్తూ, చిన్నచిన్న ఎదురుదెబ్బలను పెద్దగా పట్టించుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.