15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీరప్ప ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు: హరీశ్‌రావు

25-02-2026 01:26 AM

చింతమడక బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి

మృతుల కుటుంబాలకు పరామర్శ

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 24: మళ్లీ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చింతమడక గ్రామంలో నిర్వహించిన బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని బీరప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారని, బీరప్ప ఉత్సవాలకు సహాయం అందించి గ్రామ ప్రజలను గుర్తు చేసుకున్నారని తెలిపారు.

బీరప్ప స్వామి దయతో, ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరామర్శ సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు దొంగల శ్రీకాంత్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను హరీశ్ రావు పరామర్శించారు. అలాగే బచ్చాయిపల్లి గ్రామ పార్టీ సీనియర్ నాయకుడు దుర్గం ఎల్లం తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటానని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.