19-07-2025 12:26:21 AM
మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు
మందమర్రి,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణా పూర్(వి)లో మున్సిపల్ సిబ్బంది చేపట్టిన పిచ్చి మొక్కలను తొలగింపూ కాలువల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడం వంటి పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న ఈ వర్ష కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, రోడ్లపై చెత్త వేయకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వినూత్న శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.