2 March, 2026 | 3:55 PM

Breaking News

వ్యక్తి హత్య, ముక్కలు ముక్కలుగా చేసి యమునా నదిలో..   •   అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 555 మంది మృతి, రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ యత్నం విఫలం   •   హైడ్రా పేరు.. పెద్దలతో ప్రభుత్వ ఒప్పందం   •   భారత్–కెనడా సంయుక్త ప్రకటన: పశ్చిమాసియా యుద్ధంపై మోదీ ఆందోళన, కీలక ఒప్పందాలు   •   తెలంగాణలో "బుల్డోజర్ రాజ్": కేరళ సీఎం విమర్శలు   •   మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత   •   చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆకాష్   •   అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి   •   సమస్య లేని కాలనీలుగా మార్చడమే లక్ష్యం   •   ఫార్మా కంపెనీల అనుమతుల రద్దు కోరుతూ ప్రజావాణిలో వినతి   •  

తెలంగాణలో "బుల్డోజర్ రాజ్": కేరళ సీఎం విమర్శలు

02-03-2026 02:03 PM

తిరువనంతపురం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో(Velugumatla Bhoodan Land Demolition) ఇటీవల జరిగిన కూల్చివేతపై(demolition drive) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Kerala CM vijayan) స్పందించారు. ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో "బుల్డోజర్ రాజ్" నడుస్తోందని పినరయి విజయన్ సోమవారం ఆరోపించారు.

ముందస్తు నోటీసు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక తర్వాత, ఇప్పుడు తెలంగాణలో కూడా “బుల్డోజర్ రాజ్”(bulldozer raj) బయటపడిందని, దీనిని “ఆందోళన కలిగించే విషయం”గా విజయన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామం నుండి వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ, ఫిబ్రవరి 25న తెల్లవారుజామున "భూదాన్" భూమిలో నిర్మించిన సుమారు 700 ఇళ్లను కూల్చివేసారని, ఎటువంటి ముందస్తు నోటీసు జారీ చేయకుండానే వాటిని కూల్చివేసారని కేరళ సీఎం పేర్కొన్నారు.