30 June, 2026 | 7:12 AM

సింగరేణి పురోభివృద్ధికి కిషన్‌రెడ్డి కృషి

13-06-2024 01:43 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణకు ఎంతో కీలకమైన సింగరేణి పురోభివృద్ధికి కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాటుపడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశాభావం వ్యక్తంచేశారు. సింగరేణిపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఆ సంస్థకు మంచి రోజులు వచ్చినట్టేనని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగ్గు, గనుల శాఖ ద్వారా రాష్ట్రానికి, దేశానికి కిషన్‌రెడ్డి విశేషమైన సేవలు అందిస్తారని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు.