22-05-2025 03:04:00 PM
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వానికి మిస్ వరల్డ్ పోటీల(Miss World 2025) నిర్వహణపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని నిర్మల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. సమస్యలు పరిష్కరించడానికి గ్రామాల్లో సర్పంచ్ లేరు.. ఏదైనా పని కావాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందేన్నారు. మంత్రి కొండా సురేఖ కమిషన్లపై నిజం ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని ఇటీవల బ్యాంకర్లతో సమావేశమైనప్పుడు భట్టి విక్రమార్క అంగీకరించారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇచ్చేది తక్కువ.. చెప్పేది ఎక్కువ అన్నారు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని కేటీఆర్(KTR) తెలిపారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వచ్చే ఏదో అయినట్లు చేస్తున్నారు. నెల రోజులుగా సీఎం మదిలో ఉంది వరల్డ్ బ్యూటిస్, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు నోటీస్ అని కేటీఆర్ చమత్కరించారు. తాము కట్టిన వాటి ముందే ముద్దుగుమ్మలు ఫొటోలు దిగుతున్నారు. ఎస్ ఎల్ బీసీలో చిక్కుకున్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బటకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. ఫార్మూలా ఈ డ్రామా, కొన్ని సార్లు విద్యుత్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు లాగే కాళేశ్వరంలోనూ నిజం తెలుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అపరిచితుడులా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అప్పు పుట్టలేదు అని రెమో అంటారు.. లక్షా 60 వేల కోట్లు అప్పు రాము చేశారు. కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఉన్న డిక్లరేషన్లకే దిక్కులేదు.. ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ అంట అని కేటీఆర్ ఆరోపించారు.
బ్యూటీ కాంటెస్ట్ వల్ల ఏం లాభం?
తెలంగాణలో నిర్వహిస్తున్న బ్యూటీ కాంటెస్ట్ వల్ల ఏం లాభం? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఘోష్ విచారణ అయిపోయింది అన్నారు.. విచారణ అయ్యాక నోటీసులు ఏమిటి? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం గొప్పతనం సుప్రీంకోర్టు, సీడబ్ల్యూసీ ఛైర్మన్ కు అర్థం అయిందని కేటీఆర్ స్పష్టం చేశారు.