20 June, 2026 | 4:33 PM

Breaking News

సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలి   •   ఫిజీషియన్ డాక్టర్ల కార్యవర్గం ఏర్పాటు   •   మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి చేయాలి   •   ఇల్లందు–భూపాలపల్లికి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం   •   కెరమెరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి   •   గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •  

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్

20-06-2026 03:29 PM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించారు.   సిరికొండ మండలం, పొన్న గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జొన్న పంట అమ్ముకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్‌ కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యలులకు మనోధైర్యాన్ని చెప్పారు. అనంతరం రైతు పాండురంగ్‌ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చి,  ఆర్ధిక సాయం అందజేశారు. అంతకుముందు నేరడిగొండ చేరుకున్న కేటీఆర్ కు నేరడిగొండ టూల్ ప్లాజా వద్ద బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం ఘనంగా పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, పాడి కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భూక్యా జాన్సన్ నాయక్ ఉన్నారు.