02-06-2025 02:13:17 AM
హైదరాబాద్, జూన్ 1(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటన ముగిసింది. అక్కడ నుంచి ఆయన అమెరికా బయల్దేరి వెళ్లారు. గత నెల 27న ఇంగ్లాండులో అడుగుపెట్టిన కేటీఆర్ అనేక సదస్సులకు ప్రాతినిధ్యం వహించారు. 28న లండన్లో పార్టీ ఎన్నారై కార్యవర్గం, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు.
అదే రోజు పలువురు తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. 30న బ్రిడ్జ్ ఇం డియా వీక్ 2025 సదస్సుకు ప్రాతినిధ్యం వహించారు. 31న వార్విక్ యూనివర్సిటీలో నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించారు.
డల్లాస్కు కేటీఆర్
అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం డల్లాస్కు కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ డల్లాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణంలో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభలో పాల్గొనున్నారు.