02-06-2025 02:08:31 AM
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత వైద్యులు సక్రమంగా సేవలు అందించకపోతే అప్పుడు చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. జహీరాబాద్లో విద్యుత్ లేకపోవడం, జనరేటర్ పనిచేయకపోవడంతో సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో వైద్యులు వైద్యం అందించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం అక్కడి సూపరింటెండెంట్ను స స్పెండ్ చేసింది.
ఈ ఘటనపై వైద్య సంఘా లు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిం చా ల్సిన సర్కారు ఆ విషయాన్ని కప్పిపెడ్తూ సరైన సౌకర్యాలు లేకున్నా ఎంతో బాధ్యత తో వైద్యం అందిస్తున్న తమపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వైద్యుల మనోస్థుర్యైన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉండేదని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ)పేర్కొంది.
సస్పెండ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా?
రాష్ట్రంలో చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన అధ్వానంగా మా రింది. చాలా చోట్ల మందుల సరఫరా లేదు. కనీసం ఇన్సులిన్ సరఫరా చేయలేని దుస్థితిలో అధికారులు ఉన్నా ప్రభుత్వం స్పందిం చని దుస్థితి ఏర్పడింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి గత 4 నెలలుగా జీతాలు లేవు.
జహీరాబాద్ వైద్యాధికారిని సస్పెండ్ చేయడం పట్ల టీజీజీడీఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జనరేటర్లు ఉన్నా చాలో చోట్ల పనిచేసే పరిస్థితి ఉండదు. పనిచేస్తున్న వాటికి డీజిల్ సరఫరా కూడా కష్టంగా ఉం టుందని వైద్యులు అంటున్నారు.
ఇక కరెం టు లేడక జనరేటర్ పనిచేయకపోయినా వైద్యులు టార్చ్ లైట్ వెలుతురులో పనిచేశారంటే అభినందించాల్సింది పోయి అదే తప్పు అన్నట్లుగా నిర్ణయించడంపై వైద్యసంఘాలు మండిపడుతున్నాయి. మౌలిక వస తులలోపాలను పరిష్కరించడం ద్వారానే వాస్తవికమైన సంస్కరణలు మొదలవ్వాలని వైద్యసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మౌలిక వసతుల బాధ్యత ఎవరిది?
మౌలిక సదుపాయాలైన జనరేటర్లు, ఇతర అత్యవసర మౌలిక వసతులు సక్రమంగా ఉన్నాయో లేదో చూసేందుకు గతంలో విజిలెన్స్ పర్యవేక్షణ ఉండేదని ప్రస్తుతం వైద్యవిధాన పరిషత్ కమిషనర్ ఈ పోస్టులను భర్తీ చేయడంలో వైఫల్యం చెందారని టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆరోపించారు. విజిలెన్స్ పోస్టులే భర్తీ కానప్పుడు సమస్యలు ఎలా బయటకు వస్తాయని టీజీజీడీఏ ప్రధాన కార్యదర్శి డా.లాలూ ప్రసాద్ రాథోడ్ ప్రశ్నించారు.
ఈ తరహా వ్యవస్థాత్మక వైఫల్యాల సందర్భాల్లో విచారణలు పూర్తిగా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఉండాలని.. అప్పుడే సరైన లభిస్తుందని, వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందని కోశాధికారి టీజీజీడీఏ డా. రావూస్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని... ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో విస్తృత మౌలిక వసతుల ఆడిట్ చేయాలని టీజీజీడీఏ డిమాండ్ చేసింది.